హీరోయిన్ శ్రీలీలపై కొంతకాలంగా జరుగుతున్న ప్రచారంపై ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చింది. తనతో సమంగా నటించే నటుడు, నటికి ఎవరూ లేరని తాను గర్వపడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. తనకు అలాంటి అహంకారం లేదని, తాను ఎవరితోనూ ఈగో చూపించలేదని పేర్కొంది.
సినిమా ఇండస్ట్రీలో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమే. ప్రస్తుతం శ్రీలీల కూడా పలు విమర్శలను ఎదుర్కొంటోంది. శాండిల్వుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్న ఈ బ్యూటీ.. తెలుగులో క్రేజీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలోనూ అదే స్థాయిలో గుర్తింపు కోసం ప్రయత్నిస్తోంది.
ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘పరాశక్తి’ సినిమాతో తమిళ ప్రేక్షకులను పలకరించిన శ్రీలీల.. ప్రస్తుతం ధనుష్ సరసన ‘ఓం’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాను నవంబర్ 26న విడుదల చేయాలని భావిస్తున్నారు.
ఇక తనపై వస్తున్న ప్రచారంపై స్పందించిన శ్రీలీల.. తెలుగు, తమిళ సినిమాల్లో నటించడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. రెండు రాష్ట్రాల ప్రేక్షకులను తాను ప్రేమిస్తున్నానని చెప్పింది.
అయితే “నాతో సమంగా నటించే నటుడో, నటినో లేరని నేను గర్వపడుతున్నాను” అంటూ తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించింది. తనకు ఎలాంటి అహంకారం లేదని, ఎవరితోనూ ఈగో ప్రదర్శించలేదని స్పష్టం చేసింది.
అందరినీ గౌరవించే మనస్తత్వం తనదని శ్రీలీల చెప్పింది. కాబట్టి తన గురించి జరుగుతున్న అనవసర పుకార్లను ఎవరూ నమ్మవద్దని కోరింది. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని తెలిపింది.
ప్రస్తుతం తన పూర్తి దృష్టి నటనపైనే ఉందని.. దాని మినహా తన మనసులో మరేదీ లేదని శ్రీలీల స్పష్టం చేసింది. దీంతో తనపై జరుగుతున్న ప్రచారానికి హీరోయిన్ స్వయంగా చెక్ పెట్టినట్లైంది.

